తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలోని గుండు సీన్ తమిళనాడులో జరిగింది. సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన ఓ మహిళకు ఫోన్ వచ్చింది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, కరోనా లాంటి కొత్త వ్యాధి సోకుతోందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, ఇలా గుండు గీయించుకున్న మహిళలకు ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందన్నాడు. మహిళ ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకొని అతని ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.


