Crime· 7 Jul 2026
జనగాంలో విషాదం.. 20 పేజీల సూసైడ్ నోట్ కలకలం
TG: 20పేజీల సూసైడ్ నోట్ రాసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన రూ.10,77,528, 21నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదు. పలువురు బంధువులు కూడా తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, తను తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.