Crime

భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య
Crime· 7 Jul 2026

భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య

TG: నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌కు చెందిన ప్రశాంత్‌(35), సంధ్య దంపతులు. ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిన ప్రశాంత్‌ గతనెల 27న తిరిగి వచ్చాడు. సంధ్యకు అనిల్‌తో వివాహేతర సంబంధముంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని న్యాల్‌కల్‌ వాసి బంటితో సంధ్య ప్లాన్ వేసింది. మద్యం తాగించి భర్తను దాబా పైనుంచి తోసేశారు. కానీ ప్రశాంత్‌ గాయాలతో బయటపడడంతో హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య, అతని చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్‌ క్లీనర్(హార్పిక్)‌ను ఎక్కించింది. ప్రశాంత్‌ కన్నుమూశాడు. పోలీసులు సంధ్య, బంటి, అనిల్‌ను అరెస్ట్ చేశారు.

ఫేక్ సాలరీ స్లిప్స్‌తో SBIకి టోకరా
Crime· 5 Jul 2026

ఫేక్ సాలరీ స్లిప్స్‌తో SBIకి టోకరా

TG: ఫేక్ సాలరీ స్లిప్స్, తప్పుడు గుర్తింపు పత్రాలు సమర్పించి మేడిపల్లి SBI బ్రాంచ్ నుంచి రూ.10 లక్షల పర్సనల్ లోన్ పొంది మోసానికి పాల్పడిన ఓ నర్సింగ్ అధికారిణిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సనత్‌నగర్‌లోని ESIC సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సీనియర్ నర్సింగ్ అధికారిణిగా పనిచేస్తున్నట్లు ప్రతిభ అనే మహిళ 2023 ఏప్రిల్‌లో పర్వతాపూర్ SBI బ్రాంచ్‌లో రూ.10లక్షల పర్సనల్ లోన్‌ తీసుకుంది. బ్యాంకు అంతర్గత విచారణలో మోసం బయటపడటంతో మేడిపల్లి పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు నర్సింగ్ అధికారిణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాత్రికి రాత్రే భారీ చోరీ
Crime· 4 Jul 2026

రాత్రికి రాత్రే భారీ చోరీ

AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటర్ స్టార్టర్లను దొంగలు చోరీ చేశారు. ఒకేరాత్రి 29 స్టార్టర్లు చోరీకి గురైనట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు స్టార్టర్ బాక్సులు ఖాళీగా ఉండడం, విడిభాగాలు పొలంలో చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు. బాధిత రైతులు ఫోన్‌లో ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాచ్‌మన్ అరెస్ట్
Crime· 4 Jul 2026

చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాచ్‌మన్ అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా అల్వాల్ PS పరిధిలో నివాసం ఉంటున్న మేదిశెట్టి శ్యామ్‌రావు తమ ఇంటికి తాళం వేసి మెదక్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు(38) ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. సుమారు రూ.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

తిరుమలలో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్
Crime· 4 Jul 2026

తిరుమలలో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్

AP: నకిలీ ఆధార్ కార్డులతో TTD వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని TTD సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వీరు మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులు పొందుతున్నట్లు, ఆపై వాటిని భక్తులకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.

రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్
Crime· 4 Jul 2026

రైల్‌లో బ్లేడ్ గ్యాంగ్ బీభత్సం.. అరెస్ట్

AP: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణికులను బ్లేడ్‌తో భయపెట్టి, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో అన్నవరం స్టేషన్ వద్ద నలుగురు యువకులు జనరల్ కోచ్‌లోకి ఎక్కారు. గంజాయి మత్తులో రైలులోని ప్రయాణికులపై బ్లేడ్‌తో బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకున్నారు. అనంతరం రైలు స్లో కాగానే నిందితులు దూకి పారిపోయారు. ఆరుగురు బాధితులు విశాఖపట్నం రైల్వేపోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

"వేల మంది భర్తలు" అన్న కామెంట్  రెచ్చగొట్టేదే - ఎంపీ హై కోర్టు
Crime· 3 Jul 2026

"వేల మంది భర్తలు" అన్న కామెంట్ రెచ్చగొట్టేదే - ఎంపీ హై కోర్టు

మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన కేసులో కీలక తీర్పునిచ్చింది. భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తి జీవిత ఖైదు శిక్షను కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించింది. గొడవ జరుగుతున్న టైమ్ లో భార్య భర్తతో.. "నాకు నీలాంటి వాళ్లు వేల మంది భర్తలు ఉన్నారు" అంటూ భర్తను తీవ్రంగా రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది. ఆ కామెంట్ వినగానే నిందితుడు తీవ్ర ఆగ్రహంతో, కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడని.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్ కాదని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును 'మర్డర్' (IPC 302) నుండి 'సడన్ ప్రొవొకేషన్ వల్ల జరిగిన హత్య' (IPC 304 పార్ట్-1) గా మారుస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది.

లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !
Crime· 3 Jul 2026

లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక వెరైటీ దొంగతనం కేసు వెలుగుచూసింది. ఒక ఇంట్లో పనిమనిషిగా ఉండే విమలా దేవి అనే మహిళ, దాదాపు ఏడాది క్రితం యజమాని ఇంట్లోంచి ₹10 లక్షల వర్త్ గల డైమండ్ నెక్లెస్, గోల్డ్ లాకెట్ దొంగిలించింది. అప్పట్లో ఓనర్ అడిగితే తనేం తీయలేదంటూ బుకాయించింది. కట్ చేస్తే.. రీసెంట్‌గా ఆ పనిమనిషి దొంగిలించిన నగలు వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చేసి వా ట్సాప్ స్టేటస్ పెట్టింది. అది చూసిన ఓనర్ ఫ్రెండ్ వెంటనే అలర్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఓనర్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు విమలా దేవిని అరెస్ట్ చేసి, ఆమె దొంగిలించిన నగలను రికవర్ చేశారు.

దొంగ దొరికి పోయి బట్టలిప్పేస్తానంటూ హై డ్రామా !
Crime· 3 Jul 2026

దొంగ దొరికి పోయి బట్టలిప్పేస్తానంటూ హై డ్రామా !

రాజస్థాన్‌లోని జైపూర్ ముహానా ఏరియాలో జరిగిన ఒక క్రేజీ దొంగతనం ఇది. ఓ ఇంట్లోకి చొరబడిన మహిళ బెడ్‌రూమ్‌లోని అల్మారా ఓపెన్ చేసి నగలు, క్యాష్ దొంగిలిస్తుండగా.. హౌస్ ఓనర్ తన మొబైల్‌లోని సిసిటివి ఫుటేజ్ ద్వారా లైవ్‌లో చూసేశాడు. వెంటనే అలర్ట్ అయి నైబర్స్ హెల్ప్‌తో ఇంటి మెయిన్ గేటును లాక్ చేసి దొంగ ఉన్న రూమ్ కి వెళ్లాడు. ఓనర్ కి దొరికి పోయిన ఆ లేడీ కిలాడీ మైండ్ బ్లోయింగ్ డ్రామా స్టార్ట్ చేసింది. నేను బట్టలు విప్పేసుకుంటా.. పోలీసులు మిమ్మల్నే పట్టుకుంటారని బెదిరించింది. మొబైల్ లో దానిని రికార్డ్ చేసిన ఓనర్ పోలీసులకు పట్టించాడు.

లేడీ డాక్టర్ పై  బీజేపి యువనేత లైంగిక వేధింపులు
Crime· 3 Jul 2026

లేడీ డాక్టర్ పై బీజేపి యువనేత లైంగిక వేధింపులు

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపి నేత ఏకంగా డాక్టర్ నే లైంగిక వేధింపులకు గురిచేశాడు. సాగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ మహిళా డాక్టర్ పై బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ శ్రీవాస్తవ (అనిల్ పిప్రా) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో, ఆసుపత్రి బయటకు వస్తే తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనపై సాగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పై జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (JUDA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది.