Local· 18 Aug 2026
గిగ్ కార్మికుల సమస్యలపై బిగ్ ఫైట్.. పురాణాపూల్లో ధర్నా
TG: హైదరాబాద్ పురాణాపూల్ చౌరస్తాలో రాపిడో, ఉబర్, గిగ్ వర్కర్లకు మద్దతుగా ఇంక్విలాబ్ సేనా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల అధ్యక్షులతోపాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయబాబు, రాజేష్ ముదిరాజ్, ప్రవీణ్, గోపీనాథ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.