Local

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించొద్దు: AISF
Local· 18 Aug 2026

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించొద్దు: AISF

TG: జీవో నంబర్‌ 97ను వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఫరూక్‌నగర్ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కొత్త పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు.

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి
Local· 18 Aug 2026

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి

TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కుపత్రాలు మంజూరు చేయడంతోపాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పది గ్రామాల్లో గిరిజనులు సుమారు 20ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నారని, సాగునీటివసతి లేక పంటలు నష్టపోతున్నారని తెలిపారు. హక్కుపత్రాలు లేని రైతులకు వెంటనే పట్టాలు అందించి ప్రభుత్వ రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.