Latest

పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను ప్రారంభించి మరణించిన ఎంపీలకు సంతాపం తెలిపారు. వారి గురించి సభకు వివరించారు. మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారు. ఇవాళ పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంట్ వరకు సీజేపీ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అనుమతి లేదంటున్నా ఆగని సీజేపీ ర్యాలీ
నీట్ పేపర్ లీక్కు నిరసనగా దిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చింది. అయితే జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చే మార్గాలన్నీ పోలీసులు మూసేశారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ర్యాలీకి అనుమతులు లేవంటున్నారు. సీజేపీ మద్దతుదారులని అడ్డుకుంటున్నారు. అయినా సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, యువకులు, విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తున్నారు.
దిల్లీలో సంసద్ మార్చ్ ప్రారంభం
దిల్లీలో భారీ వర్షం ఉన్నపటికీ సీజేపీ ఆధ్వర్యంలో సంసద్ మార్చ్ ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మార్చ్కు ముందస్తు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భద్రతా దళాలను మోహరించారు.

జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు
TG: హైదరాబాద్లోని నాగోల్ మూసీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా చిరిగిపోయి నేలపై పడిపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇనుప గొలుసులు(రోప్స్) తెగిపోవడంతో జెండా కింద పడిపోయినా, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదని స్థానికులు ఫైరయ్యారు. దాదాపు వారం క్రితమే కింద పడ్డా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. స్తంభానికి మరమ్మతులు చేపట్టి, కొత్త జెండాను ఆవిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నిరాహార దీక్ష విరమణకు వాంగ్చుక్ 3 కండీషన్స్
దిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్ష విరమించడానికి 3 కండీషన్స్ పెట్టారు. 1. NEET పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి 2. CJP నాయకులు పార్లమెంటు దగ్గరికొచ్చి వివరించే విషయాలను పార్లమెంటులో చర్చిస్తామని హామీ ఇవ్వాలి 3. నా ఆరోగ్యం సహకరించకపోతే ఎంపీలే హాస్పిటల్కు వచ్చి హామీ ఇవ్వాలి. అప్పుడే నేను దీక్షను విరమిస్తాను అని వాంగ్చుక్ టిష్యూ పేపర్ మీద రాసి ఎక్స్లో పోస్ట్ చేశారు.

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
TG: రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా హిట్లర్లా వ్యవహరిస్తున్నారని, పదవులు ఎవరికి, ఎప్పటికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా అల్లీపూర్ నుంచి రంగనాయకసాగర్ వరకు రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు నీటి కోసం నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం మోటర్లను వెంటనే నడిపించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది సహజ కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల వచ్చిన కరువని ఫైరయ్యారు.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సమయానికి హాజరు కాకపోవడం, విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో స్టూడెంట్స్ చదువు దెబ్బతింటోందని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

MLA ఇంటి ముట్టడికి పిలుపు.. హౌస్ అరెస్టులు
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో BJP, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ‘ఛలో అంకాపూర్’ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు, బంద్లను నిషేధించారు. MLA పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వగా, దాన్ని అడ్డుకునేందుకు BJP కార్యకర్తలను అంకాపూర్కు తరలిరావాలని నేతలు పిలిచారు. దీంతో ఇరు పార్టీల నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, పలువురిని హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్లో ముగ్గురు బాలికలు మిస్సింగ్
TG: హైదరాబాద్లో ముగ్గురు బాలికలు ఆకస్మికంగా అదృశ్యమవడం కలకలం రేపుతోంది. దోమలగూడలో నివసిస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మిక కుటుంబాలకు చెందిన స్నేహ, లలిత, లత ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించగా, బాలికలు హిమాయత్నగర్లో ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగినట్లు గుర్తించారు. వారు ఛత్తీస్గఢ్ వెళ్లారా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లారా అనే కోణంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

పండుగ ఆనందం క్షణాల్లో విషాదం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా గుర్రాలపాలెం గ్రామస్థులు పాడేరు అమ్మవారి పాదాల వద్ద పండుగ చేసుకుని తిరిగి వస్తుండగా, పాడేరు ఘాట్ రోడ్డులోని కోమలమ్మ పనుకు మలుపు వద్ద బొలెరో వ్యాన్ బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ప్రమాదంలో దివి చలపతిరావు స్పాట్లోనే మృతి చెందగా, సూరిశెట్టి అప్పారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డ్
భారత స్టార్ షట్లర్ PV సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె జపాన్కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేమ్ల్లో ఓడించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది. 2024 డిసెంబరులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ తర్వాత టైటిల్ గెలవకపోవడంతో వచ్చిన విమర్శలకు ఈ విజయంతో ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. సింధుకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

వృద్ధాశ్రమానికి తీసుకెళ్తానని కాల్వలో నెట్టేసి, తాను దూకి
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మీసాల సూర్యవతి (60) తన తల్లి బూరమ్మ (80)ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లింది. రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్ద ఉన్న పెద్ద వంతెనపైకి చేరుకున్న తర్వాత బూరమ్మను కాల్వలోకి నెట్టివేసింది. అనంతరం ఆమె కూడా నీటిలోకి దూకింది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించగా, అప్పటికే సూర్యవతి మృతదేహం లభించింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బూరమ్మ గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
TG: SIR ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఫారాల స్వీకరణ పూర్తయ్యే వరకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం ఎవరూ గాంధీ భవన్కు రావొద్దని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై జరిగిన వర్చువల్ సమీక్షలో 25 నియోజకవర్గాల పనితీరుపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాల్లో అసలు పని జరగలేదని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరచని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జంతర్ మంతర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు CJP ఛలో పార్లమెంట్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ను తరలించే ముందు కూడా ఇలాగే భారీ ఎత్తున పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేను, వివిధ విద్యార్థి సంఘాల నేతలను కూడా అక్కడి నుంచి తరలించనున్నట్లు సమాచారం. ఛలో పార్లమెంట్ కార్యక్రమానికి పెద్దఎత్తున సీజేపీ మద్దతుదారులు వస్తుండడంతో హైటెన్షన్ నెలకుంది.

రేకుల షెడ్లోనే అక్షర యజ్ఞం
AP: పోలవరం జిల్లా గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితిలో ఉంది. 51మంది విద్యార్థులు చదువుతున్న ఈ స్కూల్కు భవనం లేక మట్టిగోడలతో నిర్మించిన రేకుల షెడ్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయురాలే బోధిస్తున్నారు. బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుతున్నారు. ఎండకాలంలో షెడ్ వేడెక్కిపోగా, వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. మంచినీరు, మరుగుదొడ్లు, వంటగది కూడా లేదు. మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు
TG: హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ IPSను తోటి ట్రైనీ లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ బూతులు తిడుతున్నాడని ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లయింట్ మేరకు అతడిపై కేసు నమోదైంది. తనను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తనకు తెలియకుండా వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడని ఆమె ఆరోపించారు.

జానీ మాస్టర్ పై బ్యాన్ ఎత్తేసిన డ్యాన్సర్స్ అసోసియేషన్ !
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై డ్యాన్సర్స్ అసోసియేషన్ విధించిన బ్యాన్ ను ఎత్తేశారు. వివాదంపై జానీ, ఆయన భార్య సుమలత ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఫిలిం ఫెడరేషన్ ఈ డెసిషన్ తీసుకుంది. నటుడు చిరంజీవి, బాలకృష్ణల జోక్యం కొంత వరకూ పనిచేసిందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితండ్యాన్సర్స్ అసోసియేషన్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవ జరిగింది. అప్పడు డ్యాన్సర్స్ అసోసియేషన్ జానీ మాస్టర్ సినిమాలకు పని చేయకూదని పిలుపునిచ్చింది.

క్లైమేట్ యాక్టివిస్ట్ వాంగ్ చుక్ గురించి మీకు తెలుసా?
లడఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ విద్యా సంస్కరణలు, పర్యావరణ ఆవిష్కరణలతో పాటు రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. 1988లో SECMOL స్కూల్ ను స్థాపించి స్థానిక విద్యా విధానాన్ని మార్చడం ద్వారా టెన్త్ పాస్ శాతాన్ని 5% నుండి 75%కి పెంచారు. ఈ కృషికి గానూ 2018లో ఆయనకు రామన్ మెగసేసే అవార్డు దక్కింది. పర్యావరణ రక్షణ కోసం 'ఐస్ స్తూపాలు' లాంటి వినూత్న ఆవిష్కరణలు చేసిన వాంగ్చుక్, లడఖ్కు ప్రత్యేక గుర్తింపు, రక్షణ కల్పించే ఆరో షెడ్యూల్ అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడారు. ఈ క్రమంలో జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల విద్యా రంగ సంస్కరణల కోసం ఢిల్లీలో 20 రోజులకు పైగా దీక్ష చేస్తున్నారు.

కెన్ బెట్వా ప్రాజెక్టుకు నిరసన సెగ-150 మంది అరెస్ట్
మధ్యప్రదేశ్ చత్తర్పూర్ లోని కూపి గ్రామంలో గత 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 'కేన్-బెట్వా' ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట నేత అమిత్ భట్నాగర్తో పాటు మరో 150 మంది నిరసనకారులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. భూసేకరణ, పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ నడుస్తోంది. ఈ రూ. 44,605 కోట్ల భారీ నదీ అనుసంధాన ప్రాజెక్టు వల్ల సుమారు 2,000 కుటుంబాలు నిరాశ్రయులవుతుండటంతో అక్కడ గొడవ నడుస్తోంది.

చిరంజీవి ప్రశంసలపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యువ ప్రొడ్యూసర్, కొణిదెల ఫ్యామిలీకి చెందిన నిహారిక తీసిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు అవార్డు దక్కడం పట్ల మెగాస్టార్ ఫ్యామిలీలో ఆనందం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నిహారికను సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ రుద్రవీణ సినిమా నిర్మాతగా మీ నాన్న ( కొణిదెల నాగబాబు) అవార్డు తీసుకుంటే ఇప్పుడు నువ్వు అవార్డు దక్కించుకోవడం మాకు ఆనందంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. దానిపై రెస్పాండ్ అయిన నీహారిక చిరంజీవి లాంటి వ్యక్తి ప్రశంసలు దక్కడంపై తోపే నన్ను నువ్వు తోపు అంటూంటే చాలా ఆనందంగా ఉంది అని అంది.

మానసిక సమస్యలతో తెలంగాణ టెక్కీ సూసైడ్ !
తెలంగాణలోని మేడిపల్లిలో ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తేజస్విని (25) అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, అర్ధరాత్రి బట్టలు లేకుండా వీధుల్లో పరిగెడుతూ స్థానిక బీరప్ప గుడి కోనేట్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఐటీ ఉద్యోగం వదిలేసిన ఆమె, గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలు, డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.