ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవీల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. కొత్త మోడళ్లలో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో దేశంలో ఈవీల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. CEEW సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ రిపోర్ట్స్ ప్రకారం దేశంలో 2014-15లో 2 వేలుగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2025-26 నాటికి 25.35 లక్షలకు చేరింది.



