శాంసంగ్ S26 యూజర్లకు షాక్

గెలాక్సీ S26 సిరీస్ ఫోన్ల ధరలు పెంచేందుకు శాంసంగ్ సిద్ధమైంది. గెలాక్సీ ఎస్26 ధర రూ.12వేల వరకు పెరగనుంది. సెప్టెంబర్ 20 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. మెమొరీ చిప్ల ధరలు పెరగడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. S26 12GB+256GB ధర రూ.87,999 నుంచి రూ.99,999కు, 12GB+512GB ధర రూ.1,07,999 నుంచి రూ.1,19,999కు పెరగనుంది. S26 Ultra ధర కూడా రూ.20 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్ను శాంసంగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది.



