TG

బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం
TG· 24 Jun 2026

బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం

హైదరాబాద్‌‌లోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను పాలీ క్లినిక్‌లుగా మారుస్తూ ఈ డిసెషన్ తీసుకుంది. వీటికి ‘ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్‌’ అనే పేరు పెట్టింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిలో ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల నిపుణులతో బస్తీల్లోనే సేవలందించనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

ఒక్క స్కూల్‌కు రెండు పేర్లు
TG· 23 Jun 2026

ఒక్క స్కూల్‌కు రెండు పేర్లు

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో ఏకశిల స్కూల్ వ్యవహారంలో MEO శ్రీనివాస్ స్పందన విమర్శలకు దారితీస్తోంది. పాఠశాల పేరు మార్పు, అనుమతులు, అడ్మిషన్లపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ యాజమాన్యం పేరు మార్పు కోసం దరఖాస్తు చేయగా ఫైల్ RJD వద్ద పెండింగ్‌లో ఉంది. అనుమతి వస్తుందని MEO చెప్పడం, మరోవైపు స్కూల్ కార్యకలాపాలు 'ఏకశిల అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ స్కూల్' పేరుతో సాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ బోర్డులు, యూనిఫాంలు, బస్సులు అన్నీ ఏకశిల పేరుతో ఉండగా, అధికారికంగా మాత్రం సెయింట్ జోసెఫ్ పేరుతోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌‌లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్
TG· 21 Jun 2026

హైదరాబాద్‌‌లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్

HYDలోని KBR పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలుచేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి చేపడుతున్న హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం
TG· 21 Jun 2026

బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం

TG: సింగరేణి కాలరీస్‌ బొగ్గు నిల్వల వ్యవహారం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సింగరేణి యాజమాన్యం చెపుతున్న లెక్కల్లోనే అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతుంది. 40లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం
TG· 21 Jun 2026

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. AP ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (NIPFP) ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అత్యధిక అప్పులు చేసినా గత మూడేళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని నివేదికలో పేర్కొంది.

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి
TG· 20 Jun 2026

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి

TG: భూసమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్‌, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్
TG· 17 Jun 2026

అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

TG: హన్మకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్(17) జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ని కలవాలని చెప్పడంతో పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యఖర్చుల నిమిత్తం లక్ష ఆర్ధికసాయం అందజేశారు. తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ హాస్పిటల్‌ క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా, క్యాంటిన్ పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారు.