Latest

AMUDA పరిధి విస్తరణపై జాయింట్ కలెక్టర్ హర్షం
AP: కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (AMUDA) పరిధి భారీగా విస్తరించడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. గతంలో 11 మండలాలు, 120 రెవెన్యూ గ్రామాలతో 896.16 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అముడా పరిధి, తాజా ఉత్తర్వులతో 14 మండలాలు, 176 రెవెన్యూ గ్రామాలు, 1,765.45 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. జీఓఎంఎస్ నం.203 ప్రకారం ఈ విస్తరణ జరిగిందని తెలిపారు.

పవర్ఫుల్ డైలాగ్తో నాగార్జున 'king 100'
హీరో నాగార్జున ఫాన్స్ ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా అప్డేట్ వచ్చేసింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాకి 'కింగ్ 100' అనే టైటిల్ పెట్టారు. తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాని నిర్మిస్తోంది. "మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు" అనే పవర్ఫుల్ డైలాగ్తో నాగార్జున క్యారెక్టర్ని పరిచయం చేశారు.

NFCలో 538 పోస్టులు.. ITI, Diploma, ఇంజినీరింగ్ వారికి ఛాన్స్
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ <a href="https://www.nfc.gov.in/recruitment.html">(NFC)</a> హైదరాబాద్లో 2026–27 అప్రెంటిస్షిప్కు 538 పోస్టులు ఉన్నాయి. ఇందులో 432 ఐటీఐకు, 106 డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పోస్టులున్నాయి. 10th + ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ మినిమమ్ 18 ఏళ్లు, మ్యాక్సిమమ్ జనరల్కు 25, OBCకు 28, SC/STకు 30 ఏళ్లు ఉండాలి. సెప్టెంబర్ 16, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ITI వారు <a href="https://www.apprenticeshipindia.gov.in/candidate-login">NAPS,</a> డిప్లొమా/గ్రాడ్యుయేట్ వారు <a href="https://nats.education.gov.in/student_register.php">NATS</a> ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

ప్రభుత్వ సేవలకు టైమింగ్ లేదా?
AP: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి సచివాలయం–1లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ధ్రువపత్రాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల పనుల కోసం సచివాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి సిబ్బంది కోసం వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సచివాలయంలో సమయపాలన పాటించాలని కోరుతున్నారు.
గిడుగు రామ్మూర్తి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే
AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషను ప్రజల వాడుక భాషగా తీర్చిదిద్దేందుకు గిడుగు రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన భాషా సేవలను నేటి తరానికి పరిచయం చేయడంతోపాటు, గిడుగు ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

లైసెన్స్కు ముందు 3 గం. వీడియో క్లాసులు తప్పనిసరి
TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి రాష్ట్రంలో కొత్త రూల్ రాబోతోంది. పర్మినెంట్ లైసెన్స్కు అప్లై చేసుకున్నవారు ముందుగా 3 గం. వీడియో లెసన్స్ చూడాలి. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ కల్పించడమే దీని టార్గెట్. వీడియో క్లాసులు కంప్లీట్ చేసినవారినే ట్రాక్ టెస్ట్కు అనుమతిస్తారు. ట్రాక్ టెస్ట్లో పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ సిస్టమ్ను కూకట్పల్లి RTAలో ట్రయల్ బేసిస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్ని జోనల్ ఆఫీసుల్లోనూ అమలు చేయనున్నారు.

ట్రాక్టర్ డ్రైవర్.. విద్యుత్ టవర్కు ఉరి!
పోలవరం జిల్లా చింతూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. చట్టికి చెందిన సోడే రాజ్ కుమార్ (ట్రాక్టర్ డ్రైవర్) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి – శనివారం శబరి నది పక్కన ఉన్న విద్యుత్ టవర్ వరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఆ స్థితిలో కనిపించాడు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గమనిక :- NCRB 2022 నివేదిక ప్రకారం, మొత్తం 1.71లక్షల ఆత్మహత్యల్లో 10.2% ప్రేమ వివాహేతర సంబంధాలవల్ల జరిగాయి.)

అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి
AP: గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్రోడ్డులో డ్రెయిన్ నిర్మాణం కోసం ఇప్పటికే నాటిన మొక్కలను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో మొక్కకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ప్రజాధనం ఖర్చు చేస్తున్న సమయంలో, నిర్మాణ పనుల పేరుతో వాటిని తొలగించడం పర్యావరణానికి, ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించడమేనని విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో డ్రెయిన్ పనులు చేపట్టి ఉంటే మొక్కలను కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

దాచేపల్లి అంజుమన్ కమిటీలో కొత్త సభ్యుడు.. నాగుల్ ఎంపిక
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండల అంజుమన్ ఇస్లామియా కమిటీలో షేక్ నాగుల్ కొత్త సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కమిటీలో సుదీర్ఘకాలం సేవలందించిన స్వర్గీయ తొండ మహబూబ్ స్థానంలో ఆయనను నియమించారు. గత 50 ఏళ్లకు పైగా దాచేపల్లి మండలం, పరిసర ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి అంజుమన్ ఇస్లామియా కమిటీ సేవలందిస్తోందని ప్రతినిధులు తెలిపారు. మహబూబ్ కుటుంబానికి చెందిన నాగుల్ కు కమిటీలో స్థానం కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు వెలుగును చాటిన భాషా దినోత్సవం
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు సురేందర్ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మాతృభాష పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. తెలుగు భాషను నిత్య జీవితంలో విరివిగా ఉపయోగిస్తూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మోడల్ మార్కెట్ కు మోక్షం ఎప్పుడు..?
TG: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 2020లో ప్రారంభమైన మోడల్ మార్కెట్ నిర్మాణం నేటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలను ఒకే చోట నిర్వహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నేడు 'తెలుగు' భాషా దినోత్సవం.. గిడుగు రామమూర్తి జయంతి
నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి బలమైన పునాది వేశారు. ప్రజలు మాట్లాడే భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన కోరుకున్నారు. సులభమైన తెలుగును ప్రజలకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా తెలుగు భాషను కాపాడుకుందాం. కొత్త తరానికి తెలుగును మరింత దగ్గర చేద్దాం.

నీటి వనరుల అభివృద్ధికి శ్రీకారం
AP: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో గిరిజన కుటుంబాల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం ప్రారంభమైంది. నాబార్డ్ సహకారంతో విద్యా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నల్లరాయిగూడ పంచాయతీలో 200 పీవీటీజీ కుటుంబాలకు తోటల పెంపకం, నీటి వనరుల అభివృద్ధి పనులను నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయ అధికారి సోమైందర్ సింగ్ ప్రారంభించారు. విద్యా ఫౌండేషన్స్ అధ్యక్షులు ప్రసాద్ ఉదండరావు మాట్లాడుతూ తివ్వకొండపై ఆరు పెర్కొలేషన్ ట్యాంకులు, రెండు ఫార్మ్ పాండ్లు నిర్మించి మొక్కలకు నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

సెప్టెంబర్ 1 నుంచి మారనున్న Important రూల్స్
సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు, డెడ్లైన్లు అమల్లోకి రానున్నాయి. LPG వాడేవారు e-KYCని ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలి. LPG ధరల్లోనూ మంత్లీ రివ్యూ తర్వాత చేంజెస్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో జర్నీ చేసే వారికి సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ వద్ద బోర్డింగ్ పాస్పై స్టాంప్ అవసరం లేదు. ఇక రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ బల్క్ FDలపై కొత్త వడ్డీ రేట్ల డిస్క్లోజర్ రూల్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ITR ఫైలింగ్కు ఆగస్ట్ 31 చివరి తేదీ.

ప్రజల సమస్యలు తెలుసుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్
AP: చిత్తూరు జిల్లా పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. మోహన్రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గడ్డూరు కాలనీని సందర్శించి గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలపై ఆరా తీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. గొడవలు, వివాదాలు, ప్రలోభాలకు దూరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు
TG: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న నస్పూర్ 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మయ్య, పైలెట్ సత్తయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Train ఫుట్బోర్డ్పై జర్నీ చేస్తున్నారా? ఇక జాగ్రత్త!
Train జర్నీలో ఫుట్బోర్డ్పై కూర్చోవడం, డోర్ దగ్గర నిలబడటం సేఫ్ కాదని సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ చేసింది. ఇలా జర్నీ చేయడం డేంజర్తో పాటు Railway Act, 1989 ప్రకారం నేరమని తెలిపింది. ఫుట్బోర్డింగ్ చేస్తే మూడు నెలల వరకు జైలు, రూ.500 వరకు ఫైన్ లేదా రెండూ విధించే అవకాశముంది. రైల్వే స్టాఫ్ ప్యాసింజర్ను ట్రైన్ నుంచి దింపే అధికారం కూడా ఉంది. కాబట్టి సేఫ్ జర్నీ కోసం డోర్ దగ్గర నిలబడకుండా, ఫుట్బోర్డ్పై కూర్చోకుండా జర్నీ చేయాలని తెలిపింది.

ఇంటి తాళం పగలగొట్టి బంగారం చోరీ
TG: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పాత వరిపేటలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి 7.5 గ్రాముల బంగారం చోరీ చేశారు. గ్రామానికి చెందిన రాజు ఈ నెల 26న కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా అందులో ఉంచిన 7.5 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న నేతలు
AP: కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజోలు నియోజకవర్గ SC సంక్షేమ సంఘం నాయకులు పరిశీలించారు. తాత్కాలిక హాస్టల్లో విద్యార్థుల వసతి పరిస్థితులు, ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 54 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతన హాస్టల్ భవనం నిర్మించేలా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అప్పటివరకు విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఉర్దూ కోర్సుల పునఃప్రారంభానికి చర్యలు
AP: ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దూరవిద్యా కోర్సులను పునఃప్రారంభించనున్నట్లు బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ విజయభాస్కర్ రావు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా RUTA AP ప్రతినిధులు వీసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉర్దూ మాధ్యమ దూరవిద్యా కోర్సులను తిరిగి ప్రారంభించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ, ఈ డిసెంబర్ నుంచే కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీ హామీపై RUTA AP ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం
TG: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వేంసూరు మండలం సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. వాహన భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ హైవేపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.