Latest

నిరుద్యోగులకు న్యాయం చేయాలని వినతి
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో మూడు జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో 7,112 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడినా మేడ్చల్, యాదాద్రిభువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు చూపించలేదని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

‘రాజధాని లేకపోతే ఏమీ చేయలేం’.. చంద్రబాబు కీలక కామెంట్స్
AP: సింగపూర్ మోడల్తో అమరావతిని కడుతున్నామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్తో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం స్టార్ట్ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాజధాని లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, రైతుల త్యాగాల వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్కూల్కు
TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్నగర్ గ్రామస్థులకు వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల చదువు సమస్యగా మారింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులతో పాటు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో మరో పది మంది చిన్నారులకు కూడా అక్కడే బోధన అందిస్తున్నారు. ఉపాధ్యాయుడు రత్నపాల్ గ్రామస్థుల సహాయంతో వాగు దాటి పాఠశాలకు చేరుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.

ఇదీ ప్రధాని మోదీ '56 ఇంచీల ఛాతి' కథ
'56 ఇంచీల ఛాతి' ఈ మోదీ డైలాగ్ మోదీని విమర్శించే అస్త్రంలా కూడా మారింది. ఆ నేపథ్యం ఏంటంటే.. 2014 జనవరి 23న మోదీ(అప్పుడు గుజరాత్ సీఎం) UP గొరఖ్పూర్లో ఎన్నికల ర్యాలీ చేశారు. అంతకంటే ముందు మోదీని నాటి యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ "UPని గుజరాత్ లా మార్చలేరు" అన్నారు. దానికి మోదీ కౌంటర్గా "గుజరాత్లా అభివృద్ధి చేయాలంటే 56 ఇంచీల ఛాతి ఉండాలి" అన్నారు. ఈ కామెంట్ మోదీని పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసేందుకు బీజేపీ లీడర్లూ, విమర్శించేందుకు ప్రత్యర్థులూ వాడుతూ '56 ఇంచీల ఛాతి'ని పొలిటికల్ స్లోగన్ చేసేశారు.
రైలు ప్రయాణంలో విత్తనాల వర్షం..
ఆహారం, నీళ్లు లేక అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయని, ఓ యువకుడు ట్రైన్లో ప్రయాణిస్తూ దారి పొడవునా పండ్ల విత్తనాలు చల్లుకుంటూ వెళ్లాడు. భవిష్యత్తులో అవి పెద్ద చెట్లయి జంతువులకు సరిపడా పండ్లు, ఆహారం ఇస్తాయని ఇలా చేశాడు.<br>పర్యావరణాన్ని, జంతువులను కాపాడేందుకు ఆ యువకుడు చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

జ్యువెలరీ కొంటున్నారా? అయితే ఈ రేట్స్ చూడాల్సిందే!
శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడంతో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం కూడా గోల్డ్ రేట్స్ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి రూ.1,42,200గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారంపై రూ.210 పెరిగి రూ.1,16,350కి చేరింది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి జ్యువెలరీ కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

శివాజీ విగ్రహంపై చెప్పు.. మహిళపై దాడి
పుణేలో శివాజీ విగ్రహంపై చెప్పు విసిరిందన్న ఆరోపణలతో ఓ మహిళపై స్థానికులు అటాక్ చేశారు. మహిళ ముఖంపై ఇంకు పోసి చుట్టుముట్టి దాడి చేశారు. విగ్రహాలు తమకు తిండిపెట్టవంటూ ఆమె చెప్పు విసిరినట్లు స్థానికులు ఆరోపించారు. తరువాత ఆమెను పోలీసులకు అప్పగించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ముస్లిం మహిళ అంటూ ప్రచారం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆమెను హిందూ మహిళ ఆశ్విని డాగ్డేగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

విసిగిపోయి రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు
TG: కొమురంభీమ్ జిల్లా పెంచికల్పేట మండలం బొంబాయిగూడాలో వర్షపునీరు, బురదతో రోడ్లు అధ్వానంగా మారడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నాగపురివాడలో రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోడ్లపై రోజుల తరబడి బురదనీరు నిలవడంతో దుర్వాసన వస్తోందని, రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. విసిగిపోయిన కాలనీవాసులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
దెయ్యాలు, దేవుళ్ల పేరిట భయం భయం!
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో అనారోగ్యంతో పిల్లలు చనిపోతుంటే, అది దేవుడి కోపం వల్లేనని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకోవైపు మహారాష్ట్ర గిరిజన హాస్టల్లో ఒక అమ్మాయి వింతగా ప్రవర్తించడంతో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. డాక్టర్లు అది 'మాస్ హిస్టేరియా' అనే మానసిక సమస్య అని చెప్పినా వినకుండా, దెయ్యాల భయంతో వందలాది మంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి.
పార్లమెంటు ఆవరణలో కోతి బొమ్మలతో నిరసన
పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు టెడ్డీ బేర్లతో కొత్తరకం నిరసన తెలిపారు. కోతిబొమ్మల్ని చేతిలో పట్టుకొని "56 ఇంచీల చిన్న కోతి.. సభలోకి త్వరగా రావాలి(56 ఇంచ్ కా చోటా బందర్.. జల్దీ ఆవో సదన్ కె అందర్) అని నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీ ఛార్జ్ పై సమాధానం చెప్పాల్సివస్తుందని పార్లమెంటుకే రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆగస్ట్ 13(ఇవాళ) పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా నేతృత్వంలో ఈ నిరసనకు దిగారు.

తిరుమల భక్తులకు గుడ్న్యూస్.. కొత్త స్పెషల్ ట్రైన్
AP: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి–విశాఖపట్నం మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్ (08509)ను ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు నడపనుంది. ప్రతి ఆదివారం, గురువారం మార్నింగ్ 9.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి నెక్స్ట్ డే మార్నింగ్ 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి (08510) సర్వీస్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు ప్రతి సోమ, శుక్రవారం నైట్ 7.40 గంటలకు బయల్దేరి నెక్స్ట్ డే ఈవెనింగ్ 6.45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలులో 22 కోచ్లు ఉంటాయి.

ఓనం పండక్కి ముగ్గురు హీరోలు..
పండగ సీజన్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఓనం పండక్కి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఖలీఫా’, దుల్కర్ సల్మాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’, అలాగే నివిన్ పౌలీ-మమితా బైజు జంటగా వస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఈ మూడు సినిమాలు రానున్నాయి.

బాలిక కిడ్నాప్కు యత్నం.. అంతలోనే పోలీసుల ఎంట్రీ
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హనుమాన్నగర్లోని అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబం పరిచయస్తుడి వద్ద రూ.30వేలు అప్పు తీసుకుంది . డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అప్పు తీర్చే వరకు మీ రెండేళ్ల కుమార్తెను తీసుకెళ్తానంటూ బెదిరించి, బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే డయల్-100కు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ పోలీసులు బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్లో ఫోన్.. జైలు ఆఫీసర్ సస్పెండ్
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్లో బ్యాన్ చేసిన వస్తువులు ఉండడం కలకలం రేపింది. CCB అధికారులు చేసిన సడన్ చెకింగ్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, పెన్డ్రైవ్, ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు. రేవణ్ణ మరో ఖైదీ ప్రతాప్ రాయ్తో కలిసి ఉన్న బ్యారక్లో మంచం కింద ఫోన్ దొరికినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ లోపంపై జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.

రిలీజ్కు ముందు చూడాల్సిందే..
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణ' సినిమాను ఢిల్లీకి చెందిన శ్రీ రామలీలా మహాసంఘ్ సంస్థ, రిలీజ్ కి ముందే తమకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపించాలని డిమాండ్ చేస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ విజ్ఞప్తి అని చెబుతుంది. అయితే దీనిపై సినీ ప్రముఖుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాలో ఏం ఉండాలో, ఏం తీసేయాలో నిర్ణయించే హక్కు కేవలం సెన్సార్ బోర్డు (CBFC)కి మాత్రమే ఉందని అంటున్నారు.

తల్లిదండ్రులను చూసుకోవడం అదృష్టం: నాగార్జున
తల్లిదండ్రులను చూసుకోవడంపై నాగార్జున ఓ ఈవెంట్లో మాట్లాడారు. 'చిన్నప్పుడు మనకి జ్వరం వస్తే అమ్మానాన్నలు ఎలా చూసుకున్నారో, పెద్దయ్యాక వాళ్లని మనం అలాగే చూసుకోవాలి' అని చెప్పారు. తన భార్య అమల 88, 90 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటుందని, ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు.

ఇందిరమ్మ టవర్స్కు నేడు శంకుస్థాపన.. లక్ష ఫ్లాట్లే టార్గెట్
TG: హైదరాబాద్లో పూర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. KPHB కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఫ్లాట్ల కన్స్ట్రక్షన్ టార్గెట్గా, CURE పరిధిలో 12 వేల ఫ్లాట్లను పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లు కట్టనున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ రూ.807.40 కోట్ల అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ శాంక్షన్ చేసింది.

ఫేక్ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిషియన్కు వేధింపులు
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బ్యూటిషియన్ను వేధిస్తున్న ఫోటోగ్రాఫర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటిషియన్గా పనిచేస్తున్న బాధితురాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, అందులో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దాసరి రామకృష్ణ అనే ఫోటోగ్రాఫర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం వెనక్కి తగ్గేది లేదు.. మహతో
రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ 11 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) నేత దేవేంద్ర మహతో.. ఆందోళన శిబిరానికి తిరిగి వెళ్లేందుకు పర్మిషన్ కోరారు. ప్రెజెంట్ రాంచీ సదర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన.. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన స్థలానికి వెళ్లేందుకు సివిల్ సర్జన్కు లెటర్ రాశారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం తనకు కేవలం ఆందోళన కాదని, బాధ్యతతో కూడిన పోరాటమని మహతో పేర్కొన్నారు.

10 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న రొనాల్డో..
ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన లాంగ్టైమ్ పార్ట్నర్ జార్జినా రోడ్రిగ్జ్ దాదాపు 10 సంవత్సరాలుగా కలిసి ఉంటూ, ఇప్పుడు పోర్చుగల్లోని కాస్కాయిస్లో చాలా సింపుల్గా సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. తమ చేతులకు ఉన్న మ్యాచింగ్ వెడ్డింగ్ రింగ్స్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ 'C ❤️ G' అని రొనాల్డో క్యాప్షన్ పెట్టారు. ఈ వెడ్డింగ్ కి కేవలం వీరి ఐదుగురు పిల్లలు, అత్యంత ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

హైదరాబాద్లో Food Festival..3 రోజులే ఛాన్స్!
TG : లక్నో నవాబుల నాటి అవాధి రాయల్ వంటకాలను రుచి చూపించడానికి మాస్టర్ షెఫ్ 'షానవాజ్ ఖురేషి' హైదరాబాద్ వస్తున్నారు. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో లక్నో రుచికరమైన బిర్యానీలు, కిరాక్ కబాబ్లు, నోరూరించే కర్రీలను లంచ్, డిన్నర్లలో వడ్డించనున్నారు. రాయల్ రుచులను ఇష్టపడే ఫుడ్ లవర్స్ కోసం ఇదొక మంచి అవకాశం.